ముగించు

జిల్లా గురించి

ఖమ్మం జిల్లా

ఖమ్మం యొక్క నామం పట్టణంలో ఒక కొండ మీద నిర్మించిన ‘నరసింహద్రి’ ఆలయం నుండి ఉద్భవించిందని చెపుతారు. ఈ ఆలయాన్ని ‘స్తంబా సిఖరి’ మరియు తరువాత ‘స్తంభాద్రి’ అని పిలుస్తారు. నరసింహ స్వామి ఒక రాతి స్తంభము నుండి ఉద్భవించి తన భక్తుడు ప్రహ్లాదుడిని కాపాడటానికి దుష్ట రాజు హిరణ్య కశ్యపుని చంపారని నమ్ముతారు. ఈ సంఘటన కృత యుగంలో జరిగినట్లు చెప్పబడింది. ఈ ఆలయం క్రింద ఉన్న నిలువు రాగిని ‘కంబా’ అని పిలుస్తారు మరియు కొండ అడుగుభాగంలో ఉన్న పట్టణాన్ని కంబమెట్ట అని పిలిచేవారు. ఇదిఛివరికి ఖమ్మం గా మారింది.